ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:21 PM

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన పల్నాడు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా , ఫిరంగిపురం గ్రామంలోని శాంతిపేటకు చెందిన అనురాధ, హృదయరాజుల కుమారుడు పసల ప్రశాంత్‌కుమార్‌(19) గుంటూరులో ఓ సినిమాహాల్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుంటాడు. విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై బయలుదేరగా గ్రామంలోని చెక్‌పోస్టు దాటుతుండగా అదే సమయానికి ఫిరంగిపురం కొండ క్వారీల నుంచి ఇసుక లారీ అతివేగంగా వచ్చి బైక్‌ వెనుక వైపు ఢీకొంది. దీంతో ప్రశాంత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో శాంతిపేటకు చెందిన యువకులు మృతుడికి న్యాయం చేయాలంటూ కొంతసేపు ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న వారికి పోలీసులు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఫిరంగిపురం పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com