ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను దగా చేసిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:19 PM

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందటానికే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని రాజధాని రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం 1084వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలను మభ్యపెట్టటానికి సీఎం జగన్‌రెడ్డి చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ఐదు కోట్లమంది ఆకాంక్ష అయిన ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు ముక్కల ఆటలో పాలకుల సొంత ప్రయోజనాలు దాగున్నాయని స్పష్టం చేశారు. రైతులను దగా చేసిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలసి పోయాయన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలుచేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com