ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల వరకు ప్రతిది అన్యాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:18 PM

మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని మంత్రాలయం  టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అమ ర్నాథ్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు బీసీ కార్పొరే షన్లకు నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.....  బీసీ కార్పొరేషన్లు 56 ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల వరకు ప్రతిది అన్యాయం జరిగిం దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన పది శాతం రిజర్వేషన్లను పున రుద్ధరణకు శాసనసభలో తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు వీరేష్‌, కార్యదర్శి పైబావి నర్సిరెడ్డి, కురువ నవకోటి నారాయణ, జంగం చిన్న స్వామి, గజ్జల నర్సిరెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com