ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడ్కో గృహలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:16 PM

జగనన్న కాలనీలో పట్టాదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని కర్నూలు  సీపీఐ జిల్లా కార్యవర్గస భ్యుడు కే.జగన్నాథం డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో టిడ్కో, ఇందిరమ్మ గృహలు లబ్ధిదారులతో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జగ న్నాథం మాట్లాడుతూ నగరానికి 20 కి.మీ దూరంలో జగనన్న స్మార్ట్‌ కానీ పేరుతో మొదట ప్రభుత్వమే నిర్మించి ఇస్తామని చెప్పి ప్రస్తుతం చేతులెత్తేసి లబ్ధిదారులే నిర్మించుకోవాలని చెప్పడం దారుణమన్నారు. అంతే కాకుండా ఇళ్లు కట్టుకోవడానికి రూ.1,80,000 మాత్రమే ఇస్తా మని చెప్పడం సిగ్గుచేటన్నారు. తక్షణమే టిడ్కో గృహలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప, నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి సి.మహేష్‌, సభ్యులు ఈశ్వర్‌, బీసన్న, శ్రీరా ములుగౌడు, కారుమంచి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com