ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకేసులో నిందితుల అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:12 PM

తాడేపలిగూడెం మండలం దండగర్ర శివారు లింగారాయుడు గూడెంలో యువకుడి హత్యకేసులో నిందితులను అరెస్టు చేసినట్టు రూరల్‌ సీఐ మూర్తి తెలిపారు. స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. లింగారాయుడుగూడెం గ్రామానికి చెందిన విరమళ్ల ఆదికృష్ణ (21) క్యాటరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. నవంబరు తొమ్మిదో తేదీన ఉదయం క్యాటరింగ్‌ పనిముగించుకుని స్నేహితులతో కలసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు, వ్యక్తిగత కక్షల దృష్ట్యా అదే గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వీరమళ్ల వెంకన్న, అతడి బంధువులు వీరమళ్ల నాగేశ్వరరావు, సూర్యచంద్రరావు యువకుడిపై దాడిచేశారు. మంచం కర్రలు, చేతులు, కాళ్లతో యువకుడిని చావబాధడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆదికృష్ణను వైద్యం కోసం ఏలూరు తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల ఒకటో తేదీన మృతి చెందాడు. దీనికి కారణమైన ముగ్గురిపై హత్యకేసు నమోదుచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com