ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బియ్యం లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 01:34 PM

రేషన్ సరుకుల పంపిణీలో ఏమైనా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం నాడు తాసిల్దార్ కార్యాలయం నందు లోకల్ యాప్ తో మాట్లాడుతూ డీలర్లు ఎం డి యు ఆపరేటర్లు ఎవరైనా బియ్యం ఇవ్వకుండా కార్డుదారులకు డబ్బులు ఇవ్వటం, తక్కువ బియ్యం ఇవ్వటం లాంటివి చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని లక్ష్మీనారాయణ తెలియచేశారు. కార్డుదారులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com