ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:39 PM

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం రోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పని చేశారు. సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com