ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లక్ష్యంగా చైనా కుట్రలు..!

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 11:34 AM

భారత్‌ లక్ష్యంగా చైనా, విదేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. హిందూ మహా సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఆఫ్రికా ఖండంలోని జిబౌటి దేశంలో తొలి విదేశీ స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉపగ్రహాలతో పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. జిబౌటి దేశంలో చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు 14 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఆయుధాలను తరలిస్తోంది. ఇవన్నీ భారత్‌పై గురిపెట్టడానికేనని అమెరికా అంచనా వేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com