ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి విశేష కృషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:36 PM

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తూ, రైతు పక్షపాతిగా సీఎం జగన్ పేరొందారని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి స్థానిక అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, డిఆర్ఓ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపి పిడి వెంకటేశ్వర రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com