ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తదాన విశిష్టతపై ప్రజల్లో చైతన్యం పెంచుదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:28 PM

రక్తదాన విశిష్టతపై ప్రజల్లో చైతన్యం కల్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటికి చెందిన దీప బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలను కాపాడుతుందన్నారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందుబాటులో ఉండేలా చేద్దామన్నారు. రక్తదాన కార్యక్రమాలను స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. రాయచోటి ప్రాంతంలో దీప బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి సేవలందించడం అభినందనీయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com