ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర వారికి 108 లీటర్ల పాలాభిషేకం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:27 PM

ఉరవకొండ పట్టణంలోని బ్రాహ్మణవీధిలో స్వయంభువుగా వెలసిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవరం పంచమి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి మూల విరాట్ కు 108 లీటర్ల పాలతో శత రుద్రాభిషేకము, నవగ్రహ పరస్పర రుద్ర స్వాహాకరాము వంటి ప్రత్యేక అభిషేకాలు చేసారు. మహామంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం లగ్నపత్రిక, దీక్షాహవనము, నాగమండలారాధ, కుంకుమార్చన జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎంసి కరిబసి, సభ్యులు శంకరయ్య, వేమన్న, సుబ్బలక్ష్మి, విజయలక్ష్మి, ఆలయ ఈఓ అంగదాల కృష్ణయ్య, అర్చకులు దివాకర శర్మ, నాగరాజు శర్మ, అర్చక బృందం, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com