ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల పెద్దన్నయ్య సీఎం జగన్: నీలం శ్యామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 12:28 PM

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఆర్థిక సమస్యలను అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శ్యామ్యూల్ మోజెస్ చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి తో కలిసి యాజలి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.


ముఖ్యంగా నిమ్న వర్గాలకు జగన్ కొండంత అండగా నిలుస్తున్నారని, కూడూగూడూ కల్పిస్తున్నారని నీలం శ్యామ్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ ను తిరిగి సీఎం చేసుకుంటేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన ఉద్ఘాటించారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నీలం శ్యామ్ ను ఎమ్మెల్యే రఘుపతి అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com