ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దామచర్ల దంపతులు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:06 AM

ఒంగోలు: నగరంలోని సంతపేట సాయిబాబా దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం దామచర్ల జనార్ధన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com