ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనగలూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 12:47 PM

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం పెనగలూరు మండలం అనంతం పల్లి గ్రామ సచివాలయ పరిధిలో అనంతంపల్లి, యాపాటివారిపల్లి, హరిజనవాడ గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఏపీఎస్ ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చించారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ శ్రీధర్ రావు, ఎంపీడీవో వరప్రసాద్, ఎస్సై చెన్నకేశవ, కృష్ణయ్య నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, సానా రెడ్డి, రెడ్డయ్య నాయుడు, హరీష్ నాయుడు, పెంచలయ్య, సర్పంచులు, ఎంపి టిసిలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com