ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా సీతారాముల నిత్యకళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 01:23 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి కళ్యాణమూర్తులను మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చారు. ముందుగా భద్రాద్రి దివ్యక్షేత్ర మహత్యాన్ని భక్తులకు అర్చక స్వాములు తెలిపిన అనంతరం కళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణతంతును వైభవంగా నిర్వహించారు. అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు. నిత్యకళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి నూతన వస్త్రాలు అక్షతలు, ప్రసాదం వితరణ గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com