ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిడగల్లు పాఠశాలలో చెకుముకి ప్రతిభ పరీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 04:06 PM

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి ప్రతిభ పరీక్ష నిడగల్లు ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పరీక్షలో బి. యామిని, కే. తులసి, కే. పవిత్ర, కార్తీక్, ప్రజ్ఞ, రామ్ చరణ్ అర్హత సాధించారని జనవిజ్ఞాన వేదిక సీతానగరం మండలం కోఆర్డినేటర్ ఆర్ సతీష్ రాజు తెలిపారు. విజేతలకు పార్వతీపురం ఆర్కే కళాశాల కరస్పాండెంట్ పూడు రామకృష్ణ బహుమతులు అందజేస్తూ పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్యను తమ కళాశాలలో అందిస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com