రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థినీ విద్యార్థులు రాస్తారోకో గజపతినగరం లోని నాలుగు రోడ్ల జంక్షన్ లో గురువారం జాతీయ రహదారిపై నిర్వహించారు. గజపతినగరం జడ్పిటిసి గార తవుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లాన త్రినాధరావు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావుల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాస్తారోకో కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో వైకాపా నాయకులు మండల సురేష్, సామంతుల పైడిరాజు, పల్లి సంజీవరావు, కర్రి రామునాయుడు, కర్రి నానాజీ, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.