ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 11:24 PM

భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి కోరారు. గత 9 నెలల వ్యవధిలో ఆరుగురు భారత ఖైదీలు పాక్ జైళ్లలో మృత్యువాత పడ్డారని, వారిలో ఐదుగురు మత్స్యకారులని బాగ్చి వెల్లడించారు. వారు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారులు వారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, ఆ సమయంలోనే వారు చనిపోయారని ఆరోపించారు. తమ సముద్ర జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో భారత మత్స్యకారులను పాకిస్థాన్ బలగాలు తరచుగా అదుపులోకి తీసుకుంటుండడం తెలిసిందే. తాజాగా, మునిగిపోతున్న పడవ నుంచి ఆరుగురు భారత జాలర్లను కాపాడామని పాకిస్థాన్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com