భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి కోరారు. గత 9 నెలల వ్యవధిలో ఆరుగురు భారత ఖైదీలు పాక్ జైళ్లలో మృత్యువాత పడ్డారని, వారిలో ఐదుగురు మత్స్యకారులని బాగ్చి వెల్లడించారు. వారు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారులు వారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, ఆ సమయంలోనే వారు చనిపోయారని ఆరోపించారు. తమ సముద్ర జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో భారత మత్స్యకారులను పాకిస్థాన్ బలగాలు తరచుగా అదుపులోకి తీసుకుంటుండడం తెలిసిందే. తాజాగా, మునిగిపోతున్న పడవ నుంచి ఆరుగురు భారత జాలర్లను కాపాడామని పాకిస్థాన్ పేర్కొంది.