ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 02:59 PM

ఏపీలోని తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చి జేసీ ట్రావెల్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిందని అభియోగాలున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు వారిని ఈడీ అధికారుుల ప్రశ్నించారు. మరోసారి వారిని ఈడీ విచారణకు పిలిచే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com