ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 11:45 PM

బడుగు, బలహీన వర్గాలను అణిచివేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ  విమర్శించారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అవినీతితో జగన్ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. వైసీపీ చేస్తున్న మోసాన్ని ఐటీడీపీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నందునే కక్షగట్టి చింతకాయల విజయ్‌పై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. పేదల సొమ్మును దోచుకుంటూ జగన్ పబ్బం గడుపుతున్నాడని ఆరోపించారు. పేద ప్రజలకు ఇసుక దొరక్కుండా వైఎస్సాఆర్‌సీపీ నేతలు ఇసుక దందాకు పాల్పడుతున్నారని విమర్శించారు. మైలవరం ఎమ్మెల్యే వైవీ సుబ్బారెడ్డి అండతో కృష్ణా నదిని తవ్వేసి ఇసుకను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని దేవినేని ఆరోపించారు.


టీడీపీ నేత చింతకాయల విజయ్‌ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలని 41A కింద నిన్న (ఈనెల 1న) నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరిలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 66(c), సెక్షన్ 419, 469, 15 (a) 505(2), 120(b)r/w 34 IPC కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ సైబర్ క్రైం పీఎస్‌లో విజయ్‌పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్స్, మొబైల్ ఫోన్స్‌తో పాటు.. ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌తో సహ హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు. హాజరుకాని పక్షంలో.. 41A(3), (4) సీఆర్‌పీసీ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com