ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రెండు వర్గాల మధ్య గోడవ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 11:42 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా మళ్లీ గొడవలు చెలరేగాయి. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. భోపాల్‌లకు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న అగర్ జిల్లాలో ఇది జరిగింది. కంకర్ గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. దారుణం కొట్టుకున్నారు.


దళిత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దసరా పండుగ సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాము విగ్రహం పెట్టామనే అక్కసుతో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులు ఆదివారం తమపై దాడికి పాల్పడ్డారని.. దళిత వర్గానికి చెందిన వ్యక్తులు ఆరోపించారు. మరో వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రం.. గర్బా వేడుకలో భాగంగా ఇద్దరు అమ్మాయిలు అశ్లీల డ్యాన్స్‌ చేశారని, దాంతో గొడవ మొదలైందని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణ చోటుచేసుకుందని చెప్పుకొచ్చారు.


దీంతో రెండు వర్గాల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రెండు వర్గాలకు చెందిన ప్రజలు కర్రలతో కొట్టుకున్న వీడియో క్లిప్‌లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. "ఒక డ్యాన్స్ గొడవకు దారితీసింది. మేము రెండు వైపుల నుంచి ఫిర్యాదులను నమోదు చేశాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం." అని సీనియర్ పోలీసు అధికారి నవల్ సింగ్ సిసోడియా చెప్పారు. మరోవైపు గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com