కోల్కతాలోని ఓ జైల్లో ఖైదీలకు దసరా పండుగ ఎంతో ఆనందాన్ని నింపింది. జైలు కూడా అంటే.. అందరికి భయం పుట్టుకొస్తుంది. అక్కడ వసతులు, భోజనం కూడా దారుణంగా ఉంటాయని టాక్. బయట తిన్నట్టు.. అక్కడ ఏ మాత్రం జరగదు. రకరకాల వంటకాలు తినడం అస్సలు సాధ్యం కాదు. అలాంటిది ఓ జైల్లో మటన్ బిర్యాని, నవరతన్ కోర్మా, రకరకాల స్వీట్లు అందిస్తున్నారు. ఇలాంటి జైళ్లు కూడా ఉన్నాయా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా దసరా ఎఫెక్ట్.
దసరా పండుగ సందర్భంగా కోల్కతాలోని ఓ జైల్లో ఖైదీలకు మంచి ఫుడ్ అందిస్తున్నారు. నాలుగు రోజులపాటు మటన్ బిర్యాని, నవరతన్ కోర్మా వంటి వెరైటీ వంటకాలను వడ్డిస్తారు. దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది నాలుగైదు రోజులు ఖైదీలకు మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తారు. అందులో భాగంగా ఖైదీలకు మంచి మంచి స్వీట్లతో పాటు బిర్యాని కూడా పెడుతుంటారు.
దక్షిణ కోల్కతాలో ప్రెసిడెన్సీ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ ఉంది. ఇక్కడ దాదాపు 2,500 మంది వరకు ఖైదీలుంటారు. వీళ్లందరికీ దసరా నవరాత్రులు.. దుర్గా పూజల సందర్భంగా ఈ నెల రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రత్యేక భోజనం అందిస్తారు. ఈ నాలుగు రోజులు అక్కడ ఖైదీలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్ని చాలా స్పెషల్ మీల్స్ పెడతారు. ముఖ్యంగా మహా అష్టమి రోజున నాన్ వెజ్ వంటకాలతో అదిరిపోయే ఫుడ్ పెడతారు. ఖైదీలకు పెట్టే మెనూలో కచ్చితంగా మటన్ బిర్యాని, మటన్ కాలియా, చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్ , చేపలు, రొయ్యలతో చేసిన వంటకాలు ఉంటాయి. వీటితో పాటు బెంగాలీ స్పెషల్ స్వీట్స్ రసగుల్లాలు, లడ్డూలు కూడా ప్రతి రోజూ అందిస్తారు.