టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకొంది. మొదటి బ్యాటింగ్ దిగిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది.దక్షిణాఫ్రికా బ్యాట్సమెన్ లో మిల్లర్ 106 పరుగులు, డికాక్ 69 పరుగులు చేసారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 చొప్పున వికెట్లు తీశారు.