ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ప్రభుత్వం సంక్షేమానికి మారుపేరుగా నిలిచింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:55 AM

సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మళ్లీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, దానికి తగ్గట్టు కార్యాచరణ జరుగుతుంది. ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని క్లీన్‌స్వీప్‌ చేస్తామని బొత్స  ఎధీమా వ్యక్తపరిచారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. పది సీట్లు పోయినా పర్వాలేదని ఏ రాజకీయ పార్టీ ఆలోచించదని, అలా ఆలోచన చేస్తే త‌న‌ దృష్టిలో అది రాజకీయ పార్టీయే కాదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ 175 సీట్లకు 175 గెలవాలని టార్గెట్‌ పెట్టుకున్నారని, తప్పకుండా గెలిస్తామన్నారు. దివంగత మహానేత  వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా.. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండు అడుగులు వేస్తానని చెప్పిన మాట ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌.. గత మూడు సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో నూటికి 97 శాతం నెరవేర్చారన్నారు. సంక్షేమానికి సంబంధించి నూటికి నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com