ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:47 AM

కృష్ణా జిల్లాలో 14 లక్షల 91 వేల మంది ఓటర్లు ఉండగా , అందులో 8 లక్షల 73 వేల మంది ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేశామని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా గౌరవ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి నివేదించారు. అలానే జగనన్న లే - అవుట్ లలో టెండర్లు పూర్తయిన వాటికీ పనులు చేపట్టి ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు .  అమరావతి సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ డా . మహేష్ కుమార్ రవిరాల పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com