ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్లలో ఏకంగా 58 సార్లు ధరలు పెరిగాయి

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 09:29 PM

ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం... 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 జూలై  6 వరకు గ్యాస్ సిలిండ్ ధర 45 శాతం పెరిగింది. 2017 ఏప్రిల్ లో ఎల్పీజీ సిలిండర్ రూ. 723గా ఉండగా 2022 జూలై నాటికి రూ. 1,053కి పెరిగింది. అయితే సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్, రవాణా ఛార్జీల కారణంగా సిలిండర్ ధరలో వ్యత్యాసం ఉంటుంది.


వంట గ్యాస్ సిలిండర్లపై లిమిట్ ను విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అయితే... ఒక కుటుంబం సంవత్సరానికి గరిష్ఠంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు రెండుకు మించి సిలిండర్లను పొందలేరు. ఇప్పటివరకైతే ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఎవరికైనా ఒక నెలలో రెండుకు మించి సిలిండర్లు అవసరమైతే... ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com