ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార‌త జ‌ట్టు ఖాతాలో ఓ చెత్త రికార్డు

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:01 PM

తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పై 8 వికెట్ల తేడాతో ఘనా విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. పచ్చికతో నిండిన పిచ్‌పై అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌ల స్వింగ్ తో భారత్‌కు అద్బుతమైన వికెట్లు అందించారు. సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీలతో బ్యాటింగ్‌లో రాణించారు.


 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్ (25; 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్), వేన్ పార్నెల్ (24; 37 బంతుల్లో ఫోర్, సిక్స్), కేశవ్ మహరాజ్ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (3/32) మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ (2/24), హర్షల్ పటేల్ (2/26) రెండు వందల వికెట్లు తీశారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసిన టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది.


 సూర్యకుమార్ యాదవ్ (50; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో), కేఎల్ రాహుల్ (51 నాటౌట్; 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో) అర్ధ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, ఎన్రిచ్ నార్జ్ చెరో వికెట్ తీశారు.


పవర్ ప్లేలో చెత్త రికార్డు: ఈ మ్యాచ్ లో భారత జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. పవర్ ప్లే (6 ఓవర్లు)లో టీమిండియా వికెట్ నష్టానికి 17 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 2016 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com