ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, పాకిస్థాన్ వేర్వేరు అంశాల్లో తమకు భాగస్వామ్య దేశాలు: అమెరికా స్పష్టీకరణ

international |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 11:44 PM

భారత్, పాకిస్థాన్ వేర్వేరు అంశాల్లో తమకు భాగస్వామ్య దేశాలని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్  స్పష్టం చేశారు. గతంలో అందజేసిన ఎఫ్-16 విమానాల కోసం తాజాగా పాకిస్థాన్ కు అమెరికా 450 మిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలు సరఫరా చేసేందుకు నిర్ణయించడం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ డీల్ హేతుబద్ధతను భారత్ ప్రశ్నిస్తుండడం పట్ల అమెరికా స్పందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ వ్యాఖ్యలకు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ బదులిచ్చారు. 


భారత్, పాకిస్థాన్ వేర్వేరు అంశాల్లో తమకు భాగస్వామ్య దేశాలని స్పష్టం చేశారు. "తాజా ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్ తో మా సంబంధాలు ఎలా ఉన్నాయన్నది చూడలేదు, భారత్ తో మా సంబంధాలను చూడలేదు. అదే సమయంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలను చూడలేదు. భారత్, పాక్ లను భిన్నమైన అంశాల్లో మాకు భాగస్వాములుగా భావిస్తాం... వాటిని ఆ విధంగానే చూస్తాం. అనేక అంశాల్లో విలువలు, ప్రయోజనాలు పంచుకుంటున్నాం. భారత్ తో మా మైత్రి దానికదే ప్రత్యేకం, పాకిస్థాన్ తో మా మైత్రి దానికదే ప్రత్యేకం" అని నెడ్ ప్రైస్ వివరించారు. ఈ కోణంలోనే ఎఫ్-16 డీల్ ను చూడాలని పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com