ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులో స్నానానికి దిగి తాతా మనవడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:05 PM

విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగి తాతా మనవళ్లు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారు ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాల ధరించారు. తాతామనవలు ఇద్దరు కలిసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. 


చెరువు లోతుగా ఉండటంతో స్నానానికి దిగిన వారు నీటిలో మునిగిపోయారు. స్నానానికి వెళ్లిన వారు తిరిగి రాకపోవటంతో తోటి భవాని మలధారులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ఇద్దరి మృతదేహలు లభ్యం కావటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రాజం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com