ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో భారత్!

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 02:05 PM

ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కైవసం చేసుకుని టీమిండియా జోరుమీదుంది.  భారత జట్టుతో పాటు టీమిండియా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఆసీస్ సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాగ్‌పూర్ తర్వాతి రెండు మ్యాచ్‌లను గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో టీమిండియా 268 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ నిలిచింది. ప్రపంచకప్‌ రానున్న నేపథ్యంలో సెప్టెంబరు 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లోనూ ఇదే ప్రదర్శనతో ర్యాంకింగ్‌లో ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం టీమ్‌ఇండియాకు ఉంది. ఆదివారం పాకిస్థాన్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమి.. భారత్‌ ర్యాంకింగ్‌ మెరుగుపడింది. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com