సిరియా తీరంలో వలసదారుల పడవ బోల్తా పడి మరణించిన వారి సంఖ్య 94కి చేరుకుంది. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ మీడియా తాజాగా ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచి సముద్రంలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ప్రారంభించారు. 20 మందిని సిరియా సైనికులు రక్షించారు. 150 మంది వలసదారులతో లెబనాన్ నుండి ఆ బోటు బయలుదేరింది. దీంతో ఆ దేశంలో విషాదం నెలకొంది.