స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీగా పతనమయ్యాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయాయి. అయితే సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.