ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్, 14 వాహనాలు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 01:49 PM

రాష్ట్రంలో అక్రమాలు, అన్యాయాలతో పాటు దొంగతనాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయనేది వాస్తవం. పోలీస్ శాఖా ఎంతగా పనిచేసిన దొంగలు మాత్రం వారి తెలివితెతలతో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏలూరు జిల్లా, ఏలూరు నగరం నందు ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నట్లు సమాచారం పొందిన పోలీస్ వారు నిఘా ఏర్పాటు చేసారు. థాని ఫలితంగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలు (అంతర్ రాష్ట్ర) చేసే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని అతని వద్ధ 14  మోటార్ సైకల్ లను (ద్విచక్ర వాహనాలు) లను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రాకేష్ తండ్రి వెంకట్ రావు, 23 సం.ముల. పెదపాడు గ్రామము మండలం వద్ద నుండి  ఏలూరు CCS పోలీస్ సిబ్బంది రికవరీ చేసుకున్నారు. తదుపరి అతనిని కోర్ట్ కి అప్పగిస్తున్నట్లు తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com