ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన హీరో వాహన ధరలు...ఒక్కో వాహనంపై వెయ్యి పెంపుదల

business |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 09:50 PM

తాజాగా హీరో మోటో కార్ప్ సంస్థ తన ద్విచక్ర వాహనాల ధరలను పెంచింది.  ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు గురువారం హీరో మోటో కార్ప్ నుంచి ఓ ప్రకటన జారీ అయ్యింది. వాహనాల తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బైకుల ధరలు పెంచక తప్పడం లేదని ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని కూడా హీరో తెలిపింది. తాను విక్రయిస్తున్న మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com