ఏపీ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 16 సర్క్యూట్లపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయం సేకరించగా 5 సర్క్యూట్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. విజయవాడ-పంచారామ యాత్ర, విజయవాడ-అష్టశక్తి యాత్ర, విజయవాడ-త్రిలింగ యాత్ర, తిరుపతి-కృష్ణదేవరాయ యాత్ర, తిరుపతి- గోల్డెన్ ట్రయాంగిల్ సర్క్యూట్లలో తొలి దశ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు.