వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్లు, నిఫ్టీ 194 పాయింట్లు లాభాలను పొందింది. అయితే నెస్లే ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను పొందాాయి.