కందుకూరు మండలం మాచవరం గ్రామంలో మంగళవారం టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు కందుకూరు నుండి దారకానిపాడు వెళ్తున్న మోటర్ బైక్ ను నెల్లూరు నుండి ఇసుక లోడుతో కందుకూరు వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న గర్భిణీ మహిళకు మరొకరికి గాయాలు కావడంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా కందుకూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.