ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు రైతులకు గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 04:36 PM

చిత్తూరు: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని దొమ్మన్న బావి దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం వేపూరు కోట పంచాయతీ ఉచ్చోళ్లపల్లికి చెందిన రైతు రాజన్న (56) ద్విచక్ర వాహనంలో అంగళ్లకు వస్తుండగా మార్గమధ్యంలోని కురబలకోట మండలం దొమ్మన్న బాయి దగ్గర ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. రాజన్న అతని వెనుకనే కూర్చుని ఉన్న మరో రైతు కురబలకోట మండలం నాయినవారి పల్లికి చెందిన వెంకటస్వామి (63) లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ముదివేటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com