ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:53 PM

డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఎన్నికైన సందర్భంగా సభలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు డిప్యూటీ స్పీకర్‌గా మీకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మీకు ఈ గౌరవాన్ని కల్పించిందనందుకు సీఎం వైయస్‌ జగన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసన సభలో సభాపతి స్థానం అంటే తండ్రి స్థానంగా భావిస్తాం. ఈ రోజు అలాంటి తండ్రిస్థానంలో తండ్రి సమానులైన మీరు కూర్చునందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీకు ఉన్నతమైన స్థానం రావాలని, మిమ్మల్ని అభిమానించే  మాలాంటి వారు.. మన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు, కార్యకర్తలు కోరుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని మన సీఎం వైయస్‌ జగన్‌ మీకు కల్పించారు. అందుకు మా ప్రజలు, కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com