పోలవరంపై సీఎం వైయస్ జగన్, అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన పనులని ఫొటోలు, వీడియోలతో సహా సభ సాక్షిగా వివరించారు. గతంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద చంద్రబాబు రూ.6.86 లక్షలు ఇస్తే.. దాన్ని రూ.10 లక్షలు చేస్తామని చెప్పాం.. అందుకు తగ్గట్టుగానే జీవో కూడా విడుదల చేశాం. దాని గురించి ఆక్షేపణ, చర్చ కూడాఅవసరం లేదన్నారు. 30–06–2021లో ఇచ్చిన జీవో చూడండి.. కళ్లు ఉండి చూడలేకపోతే ఏం చెప్పలేను గానీ, కళ్లుండి చూడగలిగితే దయచేసి చూడండి అని అసెంబ్లీలోని ఆ జీవోను సీఎం వైయస్ జగన్ ప్రదర్శించారు.