భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,916 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,748 కి చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 3,33,964 కరోనా పరీక్షలు చేశారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,28,273 కు చేరింది.