ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి జనార్దన్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:13 PM

ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం దేశమంతటా భగ్గుమన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో ఇంతవరకు విచారణ మొదలుపెట్టకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ కేసు నమోదై 12 ఏళ్లు నడిచినా ట్రయల్‌ ప్రారంభించకపోవడం ఏమిటి అని ప్రశ్నించింది. విచారణ వేగవంతం చేయాలని గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశించినా ఎటువంటి పురోగతీ లేదని, దీనిని అనుమతించలేమని, సహించలేమని తేల్చిచెప్పింది. 


విచారణ ఏ స్థితిలో ఉంది.. ఏయే కారణాలతో ట్రయల్‌ మొదలుకాలేదు అన్న అంశాలపై ఈ నెల 19వ తేదీలోగా సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్‌ ప్రత్యేక జడ్జి కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. బెయిల్‌ షరతులను సడలించాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ట్రయల్‌ మొదలైందా అని ప్రశ్నించింది. ఇంకా ప్రారంభం కాలేదని.. కేసులోని ఇతర నిందితులు కింది కోర్టులో, హైకోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేసిన కారణంగా జాప్యమైందని సీబీఐ అంటోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com