ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం వద్ద ఉద్రిక్తత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 03:42 PM

పోలీస్ కానిస్టేబుల్ భార్యల ముట్టడితో సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 'ఏక్ పోలీస్ ఏక్ స్టేట్' విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు కానిస్టేబుల్ భార్యలు శుక్రవారం నాడు(అక్టోబర్ 25, 2024) సచివాలయం ముట్టడికి యత్నించారు.'ఏక్ పోలీస్-ఏక్ స్టే్ట్' విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేశారు. అది అమలు అయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com