రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బిఆర్ఎస్ నేతలు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ నాయకులు గడ్డం రాజరెడ్డి, గడ్డం రామిరెడ్డి, గోపిడి జగన్మోహన్ రెడ్డి, పీసు తిరుపతి రెడ్డి, బద్దం శేఖర్ రెడ్డి, ఆకుల రాజారెడ్డి, రాజగౌడ్, అంజయ్య, కిషోర్, గంగాధర్, ఒజ్జెల శ్రీనివాస్, హనుమాండ్లు, గజం రవి, పుల్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.