ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చేతికి 317 జీఓ అమలుపై నివేదిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:18 PM

317 జీవో పై సబ్‌ కమిటీలో చర్చించి ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిష్ణాతులైన మేధావులతో అభిప్రాయాలను, సూచనలను సేకరించి పూర్తి నివేదికను ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డికి హైద్రాబాద్‌లోని స్వగృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి అందజేశారు. 317 జీఓ అమలుపై  రాష్ట్ర ప్రభుత్వం  క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ  అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌లు పలు సంఘాల నాయకులు, మేధావులతో సమావేశమైన విషయం తెలిసిందే.ఉద్యోగుల, ఉపాధ్యాయుల  అభిప్రాయాలను క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్‌ ద్వారా అప్లికేషన్స్‌ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో  పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్‌ కవర్‌ లో ఉంచి ముఖ్యమంత్రికి అందజేశారు. త్వరితగతిన 317 జీఓ అమలుకు సంబంధించిన విషయాలపై నివేదికను అందజేసినందుకు మంత్రులను సీఎం అభినందించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com