మంచిర్యాలలోని శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ లో బుధవారం దైమ సమాజ్ కుల దైవం దదిజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైమ సమాజ్ కుటుంబాలు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రతి ఏడాది దదిజ్ జయంతిని జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడీ ప్రగతి సమాజ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ బల్ద్వా, కార్యదర్శి ప్రేమ్ రాజ్ అగర్వాల్, కోశాధికారి ఓం ప్రకాష్ తివారీ, తదితరులు పాల్గొన్నారు.