ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీర్జాపూర్ గ్రామంలో అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 12:19 PM

వికారాబాద్ జిల్లా పూడూరు మండల్ మీర్జాపూర్ గ్రామంలో ఎస్సార్ మైనింగ్ శ్యామల రాణి అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ జిల్లా అదనపు కలెక్టర్ కు మెమొరాండం. వికారాబాద్ జిల్లా పూడూరు మండల మిర్జాపూర్  సర్వే నెంబరు 41 ప్రభుత్వ భూమి అప్పటి ప్రభుత్వం 1992 లో భూమిలేని మైనార్టీ పేదలకు అప్పుడున్న ప్రభుత్వం15 ఎకరాల భూమి 6కుటుంబాలకు ఇవ్వడం జరిగింది రషీద్ రుక్మాదిన్ రహీం హన్వర్ బి హమీనాబీ సుల్తానా వీరికి ప్రభుత్వం 1992 లో అప్పట్లో వీరికి పట్టా పాస్ బుక్కు తెలంగాణ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుక్కులు కూడా ఉన్నాయి.
వీర గత తాతల ముత్తాతల నుంచి 90 సంవత్సరాల నుంచి సాగులో క్రాస్ లో ఉన్నారు 1992 పట్టా అయింది ఇట్టి భూమిలో ప్రస్తుతం కంది పుండి మామిడి వరి పంటలు పూల తోటలో కూరగాయలు కోల్డ్ ఫామ్ ను ఇట్టి భూమిపై ఈ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు.ఇట్టి భూమిని జనవరి ఫిబ్రవరిలో 2024లో ఎస్ ఆర్ మైనింగ్ అక్రమంగా పట్టా ఉన్న భూమిని రెండు ఎకరాలను మైనింగ్ తోవడం జరిగింది పలుసార్లు ఎమ్మార్వో ఆర్డిఓ కలెక్టర్ గార్లకు  పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎలాంటి ఉపయోగం జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని పేదల తీస్తున్న మైనింగ్ ను వెంటనే ఆపాలని సిపిఎం వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ మైపాల్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం  జిల్లా నాయకులు మల్ కయ్య  అక్బర్ శ్రీను నాయక్ తేజ  భుబదితులు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com