అమెరికాలోని న్యూజెర్సీలో. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు జరుపుకుంటున్న వేళ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా న్యూజెర్సీలోనూ.. బోనాల జాతర నిర్వహించారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా.. వాళ్ల మూలాలు, సంప్రదాయాలను మర్చిపోరని నిరూపిస్తూ.. "మన తెలుగు అమెరికా సంఘం" నిర్వాహకులు ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను.. ఆదివారం (జులై 27వ తేదీన) న్యూజెర్సీలోని 1665-370 ఓక్ ట్రీ రోడ్డులోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జేలో.. సాయంత్రం నాలున్నర నుంచి సాయి దత్త ప్రీతమ్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు మాటా నిర్వహకులు. అచ్చమైన తెలంగాణ బోనాలను తలపించేలా.. డప్పు చప్పుళ్లతో బోనాల ఊరేగింపు, ఈరగోలలతో పోతరాజులు చేసే విన్యాసాలు, అమ్మవారి పాటలకు చిన్నాపెద్ద నృత్యాలు చేస్తూ.. బోనాల జాతరను ఎంతో కోలాహలంగా నిర్వహించారు.