నారాయణపేట జిల్లా కేంద్రం శివారు లోకాయపల్లిలో వెలసిన రాణీ లక్ష్మమ్మ దేవాలయ కమిటీ సమావేశం ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. రానున్న శ్రావణమాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి జరిగే పూజలు, జాతర ఉత్సవాల నిర్వహణపై చర్చించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.