కల్వకుర్తి పట్టణంలో ఆదివారం జరిగిన సభలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజక వర్గానికి వరాల జల్లు కురుపించారు. 180 కోట్లతో బీటి రోడ్లకు, కల్వకుర్తికి 100 పడకల ఆసుపత్రి, 10కోట్ల తో ఆమనగల్ లో స్కిల్ సెంటర్, హైదరాబాద్ నుండి కల్వకుర్తి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణ, ఆమనగల్ కు డిగ్రీ కళాశాల ఇంటర్ కళాశాల, వెల్దండ మండల పాఠశాలల అభివృద్ధి పనులకు ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.